భారతదేశం, ఫిబ్రవరి 11 -- జీహెచ్ఎంసీని మూడు కార్పొరేషన్లుగా విభజిస్తూ ఉత్తర్వులు తెలంగాణ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ప్రస్తుతం ఉన్న జీహెచ్ఎంసీతో పాటు మల్కాజ్‌గిరి, సైబరాబాద్ లను కార్పొరేషన్లుగా ఏర్పాటయ్యాయి.

ఉత్తర్వలు జారీ కావటమే కాకుండా ఈ మూడు కార్పొరేషన్లకు ప్రభుత్వం కొత్త కమిషనర్లను కూడా నియమించింది. జీహెచ్‌ఎంసీ కమిషనర్‌ ఆర్వీ కర్ణన్‌ను యథాతథంగా కొనసాగించింది. సీఎంసీకి(సైబరాబాద్ కార్పొరేషన్) శ్రీజన, ఎంఎంసీకి(మల్కాజ్‌గిరి కార్పొరేషన్) వినయ్‌ కృష్ణారెడ్డిని కమిషనర్లుగా నియమించారు.

1) గ్రేట్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్.(GHMC) - ఆర్వీ కర్ణన్‌, కమిషనర్

2) సైబరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (CMC) - శ్రీజన, కమిషనర్

3) మల్కాజ్ గిరి మున్సిపల్ కార్పొరేషన్ ల ఏర్పాటు (MMC) - వినయ్‌ కృష్ణారెడ్డి, కమిషనర్

Published by HT Digital Content ...