భారతదేశం, ఫిబ్రవరి 7 -- Hyd To Vja: హైదరాబాద్‌ నుంచి విజయవాడకు రూ.99 ఛార్జీతోనే ప్రయాణించే అవకాశాన్ని ఫ్లిక్స్‌ బస్ సర్వీస్ కల్పిస్తోంది. ఎలక్ట్రిక్‌ బస్ సర్వీస్ సంస్థ సేవల్నితెలంగాణ రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్‌ గురువారం ప్రారంభించారు.

పూర్తి స్థాయిలో సేవలు ప్రారంభమైన తర్వాత నాలుగు వారాల పాటు రూ.99తో హైదరాబాద్ నుంచి విజయవాడకు ప్రయా ణించే అవకాశం కల్పిస్తారు. ఈ బస్సుల్లో అయిదు గంటల్లో విజయవాడ చేరుకుంటాయి. తెలంగాణ ప్రభుత్వం అందిస్తున్న అన్ని రాయితీలు తమ బస్సుల్లోనూ వర్తిస్తాయని నిర్వాహకులు చెబుతున్నారు. ఈ బస్సుల్లో 49 మంది ప్రయాణించే సదుపాయం ఉంటుంది. రానున్న రోజుల్లో స్లీపర్ కోచ్ బస్సులను అందుబాటులోకి తీసుకురానున్నారు.

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం విద్యుత్ వాహనాలను(ఈవీ) ప్రోత్సహిస్తోందని రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ చెప్పారు. ఈటీవో మ...