భారతదేశం, మార్చి 20 -- Hyd Suicide: ప్రేమ పెళ్లి చేసుకున్న తర్వాత ఆస్తిలో వాటా ఇవ్వాలని, అడిగిన డబ్బు ఇవ్వకపోతే హత్య చేయిస్తానంటూ బెదిరింపులకు పాల్పడటంతో ఓ యువకుడు బలవన్మరణానికి పాల్పడటం సంచలనం సృష్టించింది. మృతుడి తల్లి ఫిర్యాదుతో భార్యపై పోలీసులు కేసు నమోదు చేశారు.

హైదరాబాబాద్ లక్ష్మీ నర్సింహ నగర్‌లో బుధవారం జరిగిన ఘటన స్థానికంగా సంచలనం సృష్టించింది. కామారెడ్డి జిల్లా బాన్సువాడకు చెందిన మహ్మద్ నవాజ్ సినీ పరిశ్రమలో కెమెరా మెన్‌గా పనిచేస్తున్నాడు. నవాజ్‌ 2020లో శ్వేతారెడ్డి అనే యువతిని ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. కొద్ది రోజులు వీరి కాపురం సజావుగానే సాగింది.

ఆ తర్వాత కాలంలో శ్వేతారెడ్డి ఆస్తి కోసం నవాజ్‌ను వేధించడం మొదలు పెట్టింది. ఇద్దరి మధ్య డబ్బు విషయంలో గొడవలు ముదిరాయి. ఈ క్రమంలో భర్తను వేధించడానికి శ్వేతారెడ్డి అతనిపై బాన్సువాడ, ...