భారతదేశం, ఏప్రిల్ 16 -- HYD Online Betting: క్రికెట్ బెట్టింగ్ పై ఉక్కుపాదం మోపుతున్న Cyberabad సైబరాబాద్ పోలీసులు Police, సోమవారం ఐదు ప్రాంతాల్లో దాడులు చేసి భారీ మొత్తంలో నగదును స్వాధీనం చేసుకున్నారు. Online Bettings బెట్టింగులు నిర్వహిస్తున్న 15 మందిని అదుపులోకి తీసుకున్నారు.

సైబరాబాద్ కమిషనర్ అవినాష్ మహంతి తెలిపిన వివరాల ప్రకారం.....సైబరాబాద్ SOT డీసీపీ శ్రీనివాస్ ఆధ్వర్యంలో శంషాబాద్, మాదాపూర్ ,బాలానగర్,కూకట్ పల్లి, జీడిమెట్ల, దుండిగల్ పోలీసులు సంయుక్తంగా దాడులు నిర్వహించారు.కూకట్ పల్లికి చెందిన పొందురి సురేష్ ఐపీఎల్ IPL మ్యాచ్ ల పై ఆన్ లైన్ బెట్టింగ్ నిర్వహిస్తున్నట్టు సమాచారం అందడంతో శంషాబాద్ SOT పోలీసులు దాడి చేశారు.

ఈ సందర్బంగా సురేష్ తో పాటు వికారాబాద్ జిల్లాకు చెందిన రామకృష్ణ రెడ్డిని కూడా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.ఈ బెట...