భారతదేశం, మార్చి 17 -- Hyd Betting Apps: తెలుగు రాష్ట్రాల్లో బెట్టింగ్‌ యాప్స్‌ ప్రమోట్ చేసి యువతను తప్పుదోవ పట్టిస్తున్న యూట్యూబర్లు, ఇన్‌ఫ్లూయెన్సర్లపై పోలీసులు కేసులు నమోదు చేస్తున్నారు. కొద్ది రోజుల క్రితం తెలంగాణ ఆర్టీసీ ఎండీ సూచనలతో విశాఖపట్నానికి చెందిన యూ ట్యూబర్ లోకల్‌బాయ్‌ నానిపై మొదట కేసు నమోదు చేశారు. ఆ తర్వాత హైదరాబాద్‌కు చెందిన బయ్యా సన్నీ యాదవ్‌పై కేసు నమోదైంది.

యూట్యూబ్‌ వీడియోలను ప్రమోట్ చేసే ముసుగులో బెట్టింగ్‌ యాప్‌లకు పెద్ద ఎత్తున ప్రచారం కల్పించి వారి నుంచి డబ్బు వసూలు చేస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి. బెట్టింగుల ద్వారా తాము విపరీతంగా ఆర్జించినట్టు వల వేస్తున్నారు. ప్రమోషనల్ కోడ్స్‌ రూపంలో యువతకు వల వేసి వారి బెట్టింగులు ఆడే డబ్బుల్లో ప్రమోట్ చేసినందుకు రిఫరల్‌ డబ్బులు పొందుతున్నారు. నాలుగైదేళ్లుగా తెలుగు రాష్ట్రాల్లో ఈ...