భారతదేశం, సెప్టెంబర్ 22 -- నిర్మాణ రంగంలో కీలకమైన సిమెంట్, గ్రానైట్, మార్బుల్ వంటి వాటిపై జీఎస్టీ రేట్లను తగ్గించాలని జీఎస్టీ కౌన్సిల్ తీసుకున్న నిర్ణయం.. డెవలపర్‌లకు ప్రాజెక్ట్ ఖర్చులను తగ్గించడంతోపాటు ఇళ్ల కొనుగోలుదారులకు కొంత ఊరటనిస్తుంది. జీఎస్టీ 2.0 కింద సిమెంట్, రెడీ-మిక్స్ కాంక్రీట్‌పై 18% (గతంలో 28%), ఇటుకలు, టైల్స్, ఇసుకపై 5% (గతంలో 18%), పెయింట్స్, వార్నిష్‌ల పై 18% (గతంలో 28%) పన్ను వర్తిస్తుంది.

ఈ పన్ను తగ్గింపు నిర్ణయం సెప్టెంబర్ 22, సోమవారం అంటే నవరాత్రి మొదటి రోజు నుంచి అమల్లోకి వచ్చింది. సెప్టెంబర్ 21న జాతినుద్దేశించి ప్రసంగించిన ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, ఈ నిర్ణయాన్ని 'జీఎస్టీ బచత్ ఉత్సవ్'గా అభివర్ణించారు..

తాజా పన్ను సంస్కరణల ప్రకారం, ఇప్పుడు రెండు ప్రధాన పన్ను శ్లాబులు ఉన్నాయి. చాలా వరకు వస్తువులు, సేవలకు 5% లేదా 18%...