భారతదేశం, ఫిబ్రవరి 7 -- RBI rate cut: రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) ఫిబ్రవరి 7, శుక్రవారం మానిటరీ పాలసీ కమిటీ సమావేశంలో రెపో రేట్ ను 25 బేసిస్ పాయింట్లు తగ్గించాలని నిర్ణయించింది. ఈ తగ్గింపు తరువాత అది 6.25 శాతానికి తగ్గుతుంది. వడ్డీ రేట్ ను తగ్గిస్తూ ఆర్బీఐ నిర్ణయం తీసుకోవడం ఐదేళ్లలో ఇదే మొదటిసారి. భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలు, రక్షణాత్మక వాణిజ్య విధానాలు, అంతర్జాతీయ కమోడిటీ ధరల్లో హెచ్చుతగ్గులు, ఆర్థిక మార్కెట్లలో అనిశ్చితి కారణంగా భారత ఆర్థిక వ్యవస్థ వృద్ధి అంచనాను ఆర్బీఐ 6.7 శాతానికి తగ్గించింది.

గృహ రుణం లేదా వ్యక్తిగత రుణం తీసుకున్న భారతీయ రుణగ్రహీతలకు ఈ వడ్డీ రేటు తగ్గింపు ముఖ్యమైనది. ఈ మేరకు ప్రయోజనాలను కస్టమర్లకు బదిలీ చేయాలని బ్యాంక్ లు నిర్ణయిస్తే, కస్టమర్లు తమ రుణాలపై చెల్లించే వడ్డీ రేటు తగ్గుతుంది. తద్వారా, వారి ఈఎంఐ మొత్త...