భారతదేశం, మార్చి 4 -- ప్రయాణికుల రద్దీని దృష్టిలో ఉంచుకుని దక్షిణ మధ్య రైల్వే కీలక నిర్ణయం తీసుకుంది. హోలీ పండుగ సందర్భంగా కాజీపేట జంక్షన్ మీదుగా చర్లపల్లి- హజ్రత్ నిజాముద్దీన్ మధ్య అప్ అండ్ డౌన్ మార్గంలో ఆరు ప్రత్యేక రైళ్లను నడపనుంది. ఈ మేరకు సౌత్ సెంట్రల్ రైల్వే చీఫ్ పబ్లిక్ రిలేషన్స్ ఆఫీసర్ ఎ.శ్రీధర్ ప్రకటన విడుదల చేశారు.
మార్చి 6,12, 16వ తేదీల్లో చర్లపల్లి- హజ్రత్ నిజాముద్దీన్ (07707) ఎక్స్ప్రెస్ కాజీపేట జంక్షన్కు 22.45 గంటలకు చేరుతుంది. తిరుగు ప్రయాణంలో మార్చి 8,14,18వ తేదీల్లో హజ్రత్ నిజాముద్దీన్-చర్లపల్లి (07708) ఎక్స్ప్రెస్ కాజీపేట జంక్షన్కు మరుసటి రోజు 07.30 గంటలకు చేరుకుంటుంది.
ఈ రైళ్లలో సెకండ్ ఏసీ, థర్డ్ ఏసీ, స్లీపర్ క్లాస్, జనరల్ కోచ్లు ఉంటాయి. ఈ ప్రత్యేక రైళ్లు కాజీపేట, రామగుండం, మంచిర్యాల, సిర్పూ...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.