Hyderabad, మార్చి 13 -- హోలీ పండుగ అంటే రంగులు చల్లకోవడమే కాదు, రకారకాల స్వీట్లు, ఆహారాలు కూడా ఉంటాయి. హోలీ ప్రత్యేకంగా గుజియా, జిలేబీ, బిర్యానీలు ఇలా ఎన్నో వంటకాలను ప్రతి ఇంట్లో తయారు చేస్తారు. వాటిని అధికంగా తిన్న తరువాత ఆరోగ్య సమస్యలు మొదలవుతాయి. కొందరికి తిన్న తర్వాత గుండెల్లో మంట, పుల్లని తేనుపులు వంటివి వస్తూ ఉంటాయి. అజీర్ణం, ఉబ్బరం, గుండెల్లో మంట వంటి సమస్యలు వస్తూ ఉంటాయి. ఈ సమస్యలు రాగానే చాలా మంది ఏం చేయాలో తోచక ఇబ్బంది పడుతూ ఉంటారు. అతిగా తినడం వల్ల మీకు గుండెల్లో మంట, పుల్లని తేనుపులు వస్తుంటే, ఈ అయిదు హోం రెమెడీస్ ప్రయత్నించండి.

అతిగా తినడం వల్ల పుల్లగా ఉండి పొట్టలో బరువుగా ఉన్న భావన కలుగుతుంది. గ్యాస్ తెరుచుకోకపోతే అర గ్లాసు నీటిలో మంచి నాణ్యమైన ఆవాలు, నల్ల ఉప్పు కరిగించి వేడి చేయాలి. తర్వాత ఈ నీటిని తాగండి. రోజుకు ఒకటి లేదా...