భారతదేశం, మార్చి 31 -- హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ (హెచ్‌సీయూ) భూములను ప్రైవేట్ వ్యక్తులకు అమ్మడాన్ని వ్యతిరేకిస్తూ.. విద్యార్థులు ఆందోళన చేస్తున్నారు. హెచ్‌సీయూ భూములను ప్రైవేట్ వ్యక్తులకు విక్రయించే ప్రతిపాదనను వ్యతిరేకిస్తున్నారు. భూముల వేలాన్ని తక్షణమే నిలిపివేయాలని విద్యార్థులు డిమాండ్ చేస్తున్నారు. దీనికి సంబంధించిన 10 ముఖ్యమైన అంశాలు ఇలా ఉన్నాయి.

1.ఆందోళనలను అణచివేయడానికి పోలీసులు భారీగా మోహరించారు. ఆందోళన చేస్తున్న విద్యార్థులను పోలీసులు అరెస్టు చేశారు. శాంతియుతంగా నిరసన వ్యక్తం చేస్తున్న తమపై పోలీసులు లాఠీచార్జి చేశారని విద్యార్థులు ఆరోపించారు.

2.యూనివర్శిటీ పరిధిలోని పచ్చచెట్లను నరికివేయడానికి ప్రభుత్వం పూనుకోవడంతో విద్యార్థులు అడ్డుకున్నారు. ఈ భూములలో అనేక జీవజాతులు, వృక్ష సంపద, వైవిధ్యమైన రాళ్లు ఉన్నాయని విద్యార్థులు వాది...