Hyderabad, ఏప్రిల్ 14 -- పీహెచ్ డీ ప్రవేశాల కోసం హైదరాబాద్ సెంట్రల్ వర్శిటీ నోటిఫికేషన్ జారీ చేసింది. అర్హులైన వారి నుంచి ఆన్ లైన్ ద్వారా దరఖాస్తులను స్వీకరిస్తున్నారు. ఇందుకు ఏప్రిల్ 30వ తేదీని తుది గడువుగా నిర్ణయించారు. ఈ నోటిఫికేషన్ లో భాగంగా 2025 విద్యా సంవత్సరానికి(జులై 2025 సెషన్) పలు సబ్జెక్టుల్లో పీహెచ్డీ ప్రోగ్రామ్‌ లో అడ్మిషన్లు కల్పిస్తారు.

దరఖాస్తు చేసుకునే జనరల్ అభ్యర్థులు రూ. 600, ఈడబ్యూఎస్ అభ్యర్థులు రూ. 550 చెల్లించాలి. ఓబీసీ అభ్యర్థులు రూ. 400, ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగ అభ్యర్థులు రూ. 275 చెల్లించాలని నోటిఫికేషన్ లో పేర్కొన్నారు. ఈ ఫీజును కూడా ఆన్ లైన్ విధానంలోనే చెల్లించాలి.

అర్హత సాధించే అభ్యర్థులు పొలిటికల్‌ సైన్స్‌, సోషియాలజీ, ఫిజిక్స్, ఇంగ్లీష్‌, హింది, హిస్టరీఅంత్రపాలజీ, ఎడ్యుకేషన్‌, రీజినల్‌ స్టడీస్‌, పోక్‌ కల్చర్‌ ...