Hyderabad, ఫిబ్రవరి 18 -- Director Harish Shankar About Dragon Movie: దక్షిణ భారత చలనచిత్ర పరిశ్రమలో ప్రముఖ నిర్మాణ సంస్థల్లో ఒకటైన ఏజీఎస్ ఎంటర్‌టైన్‌మెంట్ వరుసగా హిట్ చిత్రాలను నిర్మిస్తోంది. ఏజీఎస్ ఎంటర్‌టైన్‌మెంట్ తమిళ హీరో ప్రదీప్ రంగనాథన్ కాంబినేషన్‌లో బ్లాక్ బస్టర్ 'లవ్ టుడే' చిత్రం వచ్చింది.

ఇప్పుడు మళ్లీ ఈ కాంబినేషన్‌లో 'రిటర్న్ ఆఫ్ ది డ్రాగన్‌' ఆడియెన్స్ ముందుకు రానుంది. ఈ సినిమాలో ప్రదీప్ రంగనాథన్‌కు జోడీగా అనుపమ పరమేశ్వరన్, కయాదు లోహర్ హీరోయిన్లుగా నటించారు. ఈ చిత్రాన్ని కల్పాతి ఎస్. అఘోరం, కల్పాతి ఎస్. గణేష్, కల్పాతి ఎస్. సురేష్ నిర్మించారు. ఓరి దేవుడా సినిమాతో గుర్తింపు తెచ్చుకున్న అశ్వత్ మారిముత్తు రిటర్న్ ఆఫ్ ది డ్రాగన్ చిత్రానికి దర్శకత్వం వహించారు.

రిటర్న్ ఆఫ్ ది డ్రాగన్ సినిమా ఫిబ్రవరి 21న గ్రాండ్‌గా థియేటర్లలో విడుదల ...