భారతదేశం, ఫిబ్రవరి 3 -- Guntur Rape and Murder: అత్యాచారం కేసులో జైలుకు వెళ్లి బెయిల్‌పై విడుదలైన వ్యక్తి వృద్ధురాలిపై అత్యాచారం హత్య చేయడం గుంటూరులో కలకలం రేపింది. జైలు నుంచి విడుదలైన మూడు రోజులకే మరో నేరానికి పాల్పడటం పోలీసులు విస్తుబోయేలా చేసింది. 64 ఏళ్ల వృద్ధురాలిపై అత్యాాచారం చేసి ఆపై హతమార్చాడు. గుంటూరు జిల్లా పెదనందిపాడులో జరిగిన ఈ దారుణ ఘటన స్థానికంగా కలకలం రేపింది.

మొదట అనుమానాస్పద మృతిగా భావించి కేసు నమోదు చేసిన పోలీసులు, ఆ తర్వాత విచారణలో హత్యగా గుర్తించారు. స్థానికంగా ఉండే పాత నేరస్తుడు హత్య చేసినట్టు గుర్తించారు. నిందితుడు మంజు 2023లో ఇదే తరహా ఓ మహిళపై అత్యాచారం చేసి హత్య చేసి జైలుకు వెళ్లాడు. ఆ కేసులో బెయిల్‌పై బయటకు వచ్చాక 2024లో కూడా ఓ మహిళపై అత్యాచారానికి పాల్పడ్డాడు. ఆ కేసులో కొన్ని నెలలుగా జైలులో ఉన్న నిందితుడు మూడు ర...