భారతదేశం, ఫిబ్రవరి 15 -- ఫ్రీస్టైల్ చెస్ గ్రాండ్ స్లామ్ టూర్ లో భాగంగా ఫస్ట్ లెగ్ టోర్నీ తాజాగా జర్మనీలోని వీసెన్ హాస్ లో జరిగింది. ఈ టోర్నీలో ఎన్నో అంచనాలతో బరిలో దిగిన ప్రపంచ ఛాంపియన్ గుకేశ్ ఒక్క విజయమూ సాధించలేదు. ఎనిమిదో స్థానంలో నిలిచి నిరాశపరిచాడు. దీంతో అతను సుమారు రూ.17.33 లక్షలు (20 వేల డాలర్లు) ప్రైజ్ మనీ పొందాడు.

ఈ టోర్నీలో ఆడకపోయినా అర్జున్ ఇరిగేశి ఖాతాలో రూ.23.51 లక్షలు (27,132 డాలర్లు) చేరాయి. దీని వెనుక ఓ కారణం ఉంది. ఫ్రీస్టైల్ చెస్ ప్లేయర్స్ క్లబ్ లో భాగమైన అర్జున్ నాన్ పార్టిసిపేటింగ్ మెంబర్ గా ఉన్నాడు. ఇలా టోర్నీలో ఆడని వాళ్ల ఎలో రేటింగ్ 2725 కంటే ఎక్కువగా ఉంటే ఒక్కో పాయింట్ కు 357 డాలర్లు ఇస్తారు. ప్రస్తుతం 2801 ఎలో రేటింగ్ పాయింట్లు కలిగి ఉండటంతో అర్జున్.. గుకేశ్ కంటే ఎక్కువ మనీ గెలుచుకున్నాడు.

ఈ టోర్నీ ఛాంపియన్ కీమర...