భారతదేశం, ఏప్రిల్ 16 -- Gujarat viral video: గుజరాత్ వ్యాపారవేత్త భవేష్ భండారీ (Bhavesh Bhandari), ఆయన భార్య ఇటీవల సన్యాసం స్వీకరించాలని నిర్ణయించుకున్నారు. పూర్తిగా నిరాడంబర జీవితాన్ని గడపాలని నిర్ణయించుకుని తమ జీవితకాల సంపాదన అయిన రూ.200 కోట్లను ప్రజలకు విరాళంగా ఇచ్చేశారు. ఆదివారం భారీ ఊరేగింపు నిర్వహించి. పెద్ద ఎత్తున నగదు, ఇతర ఆభరణాలను ప్రజలకు అందజేశారు. త్వరలోనే వారు పూర్తిస్థాయిలో సన్యాసం తీసుకోనున్నారు.

సన్యాసం తీసుకోవాలని నిర్ణయించుకున్న తరువాత, భవేష్ భండారీ దంపతులు తమ సంపదను, నగదును, ఖరీదైన ఆభరణాలను, ఖరీదైన ఎలక్ట్రానిక్ గాడ్జెట్స్ ను ప్రజలకే ఇచ్చివేయాలనుకున్నారు. ఖరీదైన ఉపకరణాలను వాడకూడదని నిర్ణయించుకున్నారు. దాంతో, ఆదివారం గుజరాత్ లోని సబర్ కాంత జిల్లాలో రథాన్ని తలపించేలా అలంకరించిన వాహనంలో నిల్చొని, కుటుంబ సభ్యులతో కలిసి భారీ ...