భారతదేశం, మార్చి 18 -- Gudur Railway Junction: దక్షిణ మధ్య రైల్వే పరిధిలో కీలకమైన జంక్షన్లలో ఒకటైన గూడూరు రైల్వే స్టేషన్ రూపురేఖలు మారనున్నాయి. ఉమ్మడి నెల్లూరు జిల్లాలో ఉన్న గూడూరు రైల్వే స్టేషన్‌ను అభివృద్ధి చేయడానికి రైల్వే మంత్రిత్వ శాఖ రూ.49కోట్లను మంజూరు చేసింది. ఈ నిధులతో స్టేషన్‌ రూపురేఖల్ని సమూలంగా మారుస్తారు. ప్రయాణీకులకు మెరుగైైన ప్రయాణ అనుభవాన్ని కల్పించడంతో పాటెు తిరుపతి, నెల్లూరు జిల్లా ప్రాంత ప్రజల రవాణా సౌకర్యాలను మెరుగు పరచడానికి ఉపయోగ పడుతుంది.

దక్షిణ మధ్య రైల్వే పరిధిలో ఉన్న గూడూరు రైల్వే స్టేషన్ చెన్నైకు సమీపంలో ఉన్న కీలకమైన రైలు జంక్షన్‌, దక్షిణ కోస్తాలో గూడూరు కీలకమైన రవాణ కూడలిగా ఉంది. ఈ ప్రాంతంలోని కీలక స్టేషన్లను ఆధునీకరించే చర్యల్లో భాగంగా తాజాగా నిధులు కేటాయించారు.

రైలు ప్రయాణీకులకు ప్రపంచ స్థాయి సౌకర్యాలను అంద...