భారతదేశం, ఫిబ్రవరి 14 -- Govt Employees : ముస్లిం ఉద్యోగ, ఉపాధ్యాయుల‌కు రాష్ట్ర ప్రభుత్వం గుడ్‌న్యూస్ చెప్పింది. రంజాన్ నెలలో ముస్లిం ప్రభుత్వ ఉద్యోగులు, ఉపాధ్యాయులు ఒక గంట ముందు తమ కార్యాలయాలు, పాఠ‌శాల‌ల‌ నుంచి ఇంటికి వెళ్లడానికి అనుమతి ఇచ్చింది. ముస్లిం సోద‌రుల‌కు ఈ అవ‌కాశం క‌ల్పిస్తూ రాష్ట్ర ప్రభుత్వ ఉత్తర్వులు జారీ చేసింది.

ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి (రాజకీయ) ముకేష్ కుమార్ మీనా విడుద‌ల చేసిన ఉత్తర్వుల్లో ప్రభుత్వం ముస్లిం ఉద్యోగులకు న‌మాజ్ చేసుకువ‌డానికి, అలాగే ఉప‌వాసం తీర్చుకోవ‌డానికి అవ‌కాశం క‌ల్పించింది. ఇస్లాం మతాన్ని ఆచ‌రించే ఉద్యోగులంద‌రికీ ఈ అవ‌కాశం ఉంటుంది. ఉపాధ్యాయులు, ఉద్యోగులు, కాంట్రాక్ట్, అవుట్‌సోర్సింగ్ ప్రాతిపదికన నియమించబడిన ఉద్యోగులు, గ్రామ, వార్డు సచివాలయాల ఉద్యోగుల్లోని ముస్లింల‌కు ఈ అవ‌కాశాన్ని రాష్ట్ర ప్రభుత్వం అ...