భారతదేశం, మార్చి 17 -- Gold Loans Issue: తెలుగు రాష్ట్రాల్లో బంగారు రుణాల మంజూరు చేయడంలో బ్యాంకులు కీలక మార్పులు చేశాయి. ఆర్‌బిఐ ఆదేశాల మేరకు రుణాల చెల్లింపు వ్యవధిని ఏడాదికి పరిమితం చేశాయి. తీసుకున్న రుణాన్ని ఏడాదిలోగా తిరిగి చెల్లించాల్సిందేనని తేల్చి చెబుతున్నాయి. బంగారు రుణాల చెల్లింపుపై అమల్లోకి వచ్చిన మార్పులు రుణగ్రహీతల్ని ఇబ్బందులకు గురి చేస్తున్నాయి.

పట్టణ ప్రాంతాల్లో బంగారు రుణాలను అగ్రికల్చర్ విభాగంలో మంజూరు చేయడంపై చాలా కాలం క్రితమే ఆర్బీఐకు ఫిర్యాదులు అందాయి. వ్యవసాయ అవసరాల కోసం కోసం తీసుకునే బంగారు రుణాల పరిమితి ఏడాదిలోపు తీర్చేయాలనే ఉద్దేశంలో వాటిని మంజూరు చేసేవారు. తక్కువ వడ్డీకి బంగారాన్ని తాకట్టు పెట్టుకుని వ్యవసాయ పనుల కోసం ఈ రుణాలను మంజూరు చేసేవారు.

బ్యాంకులకు కూడా బంగారంపై ఇచ్చే రుణాలు లాభసాటిగానే ఉండేవి. పంటల సాగుక...