భారతదేశం, ఏప్రిల్ 11 -- Girl on period: భారతదేశంలో రుతుస్రావం అవుతున్న మహిళల పట్ల వివక్ష ఇంకా కొనసాగుతోంది. ఈ నెలలో రుతుస్రావం ప్రారంభమైన 8 వ తరగతి బాలికను పరీక్షల సమయంలో తరగతి గది వెలుపల కూర్చోబెట్టారు. తమిళనాడులోని కోయంబత్తూరులోని సెంగుట్టైపాళయం గ్రామంలోని ఓ ఉన్నత పాఠశాలలో ఈ ఘటన చోటుచేసుకుంది. బాలిక (13) పట్ల వివక్ష చూపిన పాఠశాల ప్రధానోపాధ్యాయుడిని సస్పెండ్ చేసినట్లు జిల్లా పాఠశాల విద్యాశాఖ ఉన్నతాధికారులు తెలిపారు. దీనిపై దర్యాప్తు కూడా ప్రారంభించారు.
తరగతి గది మెట్లపై కూర్చుని పరీక్ష రాస్తున్న ఆ బాలిక వీడియో సోషల్ మీడియాలో విపరీతంగా షేర్ అయింది. రుతుస్రావం అవుతున్న అమ్మాయిలు, మహిళల పట్ల వివక్ష చూపుతున్నారని నెటిజన్లు మండిపడుతున్నారు. దాంతో, ఉన్నతాధికారుల దృష్టి ఈ ఘటనపై పడింది. ఈ వీడియోలో బాలిక తన తరగతి గది వెలుపల మెట్లపై ఒంటరిగా కూర్చ...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.