భారతదేశం, ఫిబ్రవరి 2 -- Gas Tanker Accident: హనుమకొండ జిల్లా కమలాపూర్ వెళ్తున్న గ్యాస్‌ ట్యాంకర్‌ రింగ్sa రోడ్డు వద్ద రాంపూర్ సమీపంలో డివైడర్ ను ఢీకొట్టి రోడ్డు అవతలికి వెళ్లి పల్టీ కొట్టింది. దీంతో అందులో ఉన్న డ్రైవర్ వెహికిల్ కింద పడి చనిపోయాడు.

గ్యాస్ తో నిండి ఉన్న ట్యాంకర్ బోల్తా కొట్టగా అందులోంచి గ్యాస్ లీకవుతుందన్న ప్రచారంతో దాదాపు నాలుగు గంటల పాటు రింగ్ రోడ్డు ప్రాంతంలో హై టెన్షన్ వాతావరణం కనిపించింది. ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి..

తమిళనాడు రాష్ట్రానికి చెందిన నటరాజన్ (46) అనే లారీ డ్రైవర్ హెచ్‌పి గ్యాస్ కంపెనీలో పని చేస్తున్నాడు. హనుమకొండ జిల్లా కమలాపూర్ మండల కేంద్రానికి సమీపంలోని ఉన్న గ్యాస్ బాట్లింగ్‌ యూనిట్ కు లోడ్ తీసుకురావాల్సి ఉండగా.. గురువారం ఉదయం హైదరాబాద్ చర్లపల్లి నుంచి ట్యాంక్ లోడ్ చేసుకుని బయలుదేరాడు....