తెలంగాణ,ఖమ్మం, ఫిబ్రవరి 9 -- Finance Minister Mallu Bhatti Vikramarka: లక్షల కోట్ల అప్పుల్లో కూరుకుపోయిన తెలంగాణ రాష్ట్ర భవిష్యత్ ను నిర్ధేశించే ఆర్ధిక శాఖ ఖమ్మం జిల్లా నేతకు దక్కడం అరుదైన గౌరవంగానే చెప్పుకోవాలి. మధిర నియోజకవర్గ ఎమ్మెల్యే మల్లు భట్టి విక్రమార్క శనివారం ఆర్ధిక శాఖా మంత్రిగా రాష్ట్ర తొలి పద్దు(Telangana Budget 2024)ను ప్రవేశపెట్టడం ప్రత్యేకించి ఖమ్మం జిల్లాకు చరిత్రాత్మక అంశమే. సుదీర్ఘమైన రాజకీయ జీవితంలో అనేక రికార్డులు సాధించిన భట్టి విక్రమార్క మరో రికార్డును తన సొంతం చేసుకున్నారు. స్వాతంత్రం వచ్చిన తర్వాత ఆంద్రప్రదేశ్ రాష్ట్రంలో ఏర్పడిన ప్రభుత్వాల్లోనూ గడిచిన పదేళ్ల తెలంగాణలోనూ మంత్రి వర్గంలో ఎంతో ప్రాధాన్యత కలిగిన ఆర్థిక శాఖను ఖమ్మం జిల్లాలో ఎవ్వరికీ దక్కలేదు.

ఈ నెల 8వ తేదీ నుంచి జరుగుతున్న శాసనసభ సమావేశాల్లో భాగంగా 10వ...