భారతదేశం, ఫిబ్రవరి 14 -- Father Sold Son: సంగారెడ్డి జిల్లాలో అమానవీయ ఘటన చోటు చేసుకుంది. లక్ష రూపాయలకు రెండేండ్ల వయసున్న కన్న కొడుకునే తండ్రి విక్రయించడం వెలుగు చూసింది. ఈ సంఘటన సంగారెడ్డి జిల్లాలో చోటుచేసుకుంది.

ఈ ఘటనలో తండ్రితో పాటు అతనికి సహకరించిన నలుగురిని పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్ తరలించినట్లు పోలీసులు తెలిపారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం మహారాష్ట్రకు చెందిన ఆశిక్ తులసీరామ్,మాధురి దంపతులు సంగారెడ్డి జిల్లా గుమ్మడిదల మండలం దోమడుగులో నివాసం ఉంటూ,స్థానిక పరిశ్రమలో కార్మికులుగా పనిచేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు.

వీరికి రెండు సంవత్సరాల కుమారుడు నాక్ష్ ఉన్నాడు. కొంతకాలంగా భార్యాభర్తల మధ్య తరచూ గొడవలు జరుగుతున్నాయి. దీంతో మాధురి కుమారుడిని తీసుకొని మహారాష్ట్ర కు వెళ్ళింది. రెండు రోజుల క్రితం తులసీరామ్ వెళ్లి భార్యకు చెప్పకుండా ...