భారతదేశం, మార్చి 15 -- అప్పుల బాధతో కౌలు రైతు ఆత్మహత్యాయత్నానికి పాల్పడగా.. చికిత్స పొందుతూ శుక్రవారం రాత్రి మరణించాడు. ఈ ఘటన జయశంకర్ భూపాలపల్లి జిల్లా చిట్యాల మండలం రామచంద్రపురంలో జరిగింది. గ్రామస్థులు తెలిపిన వివరాల ప్రకారం.. జయశంకర్ భూపాలపల్లి జిల్లా చిట్యాల మండలం రామచంద్రాపురం గ్రామానికి చెందిన సూర కుమారస్వామి (44) వ్యవసాయం మీద ఆధారపడి జీవిస్తున్నాడు.

సొంతంగా భూమి లేకపోవడంతో ఆరేళ్ల కిందట ఇదే మండలంలోని తిరుమలాపురం శివారు గుంటూరుపల్లికి భార్యా పిల్లలతో కలిసి వలస వెళ్లాడు. అక్కడ నాలుగు ఎకరాల భూమిని కౌలుకు తీసుకుని వ్యవసాయం చేస్తున్నాడు. ఇంతవరకు బాగానే ఉండగా.. కౌలు రైతుగా ఉన్న కుమారస్వామికి ఎదిగిన బిడ్డ ఉంది. కొంతకాలం కిందట ఆమె పెళ్లి చేశాడు. వ్యవసాయం కోసం పెద్ద మొత్తంలో అప్పు చేయడం, బిడ్డ పెళ్లి కోసం తెచ్చిన అప్పులతో ఆర్థిక ఇబ్బందులు తల...