భారతదేశం, ఫిబ్రవరి 16 -- రేపటితో మాఘమాసం పూర్తి కాబోతోంది. రేపు మాఘ అమావాస్య. తర్వాత రోజు నుంచి కూడా ఫాల్గుణ మాసం మొదలవుతుంది. ఫాల్గుణ మాసం అంటే విష్ణువుకు ఎంతో ఇష్టం. ఫాల్గుణ శుద్ధ పక్షంలో పయో వ్రతాన్ని ఆచరిస్తారు. అలా చేయడం వలన విష్ణువు అనుగ్రహం కలుగుతుంది. అలాగే ఆ వ్రతం చేసే వారు విష్ణువుకు క్షీరాన్నాన్ని నైవేద్యంగా పెడతారు. అలా చేయడం వలన అభీష్ట సిద్ధి కలుగుతుందని భాగవత పురాణంలో చెప్పబడింది. ఆదితి పయో వ్రతం ఆచరించి వామనుడిని కుమారుడిగా పొందింది.

ఫిబ్రవరి 17 నుంచి ఫాల్గుణ మాసం మొదలు అవుతుంది. ఫాల్గుణ మాసంలో ధన దానం, గోదానం, వస్త్రదానం వంటివి చేస్తే శుభ ఫలితాలు కలుగుతాయి. విష్ణు అనుగ్రహాన్ని పొందడానికి వీలవుతుంది. ఇదే చివరి మాసం కాబట్టి ఈ పనులు కచ్చితంగా చేయండి. దీంతో శుభ ఫలితాలను పొందవచ్చు.

ఫాల్గుణ మాసంలో రావణుడితో యుద్ధం చేయడానికి వా...