భారతదేశం, ఫిబ్రవరి 2 -- Fake Journalists : నల్గొండ జిల్లాలో నకిలీ విలేకరులు హల్చల్ చేశారు. గత కొంతకాలంగా ఓ ముఠా పోలీసులను లక్ష్యంగా చేసుకుని అక్రమ వసూళ్లకు తెగబడుతున్నారు. సోషల్ మీడియాలో నెగిటివ్ వార్తలు రాస్తామని బెదిరిస్తూ వసూళ్లకు పాల్పడుతున్నారు. సీఐని బెదిరించి రూ.5 లక్షలు డిమాండ్ చేసి రూ 1.10 లక్షలకు డీల్ కుదుర్చుకున్నారు. ఈ ముఠా గత నెల రోజులుగా డబ్బుల కోసం బ్లాక్ మెయిల్ చేస్తూ పోలీసు అధికారులను ముప్పు తిప్పలు పెడుతోంది.

నకిలీ విలేకరుల ఆగడాలు తట్టుకోలేక సీఐ తన స్నేహితుడి ద్వారా రూ.1.10 లక్షలు ఇచ్చినట్లు తెలుస్తోంది. అయినా మరో రూ.4 లక్షలు ఇవ్వాలంటూ నకిలీ విలేకరులు సీఐ కుటుంబాన్ని వేధించారు. ముఠా ఆగడాలు మితిమీరడంతో బాధిత పోలీసు అధికారి పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ ఫిర్యాదుతో పోలీసులు నకిలీ విలేఖరిని అదుపులోకి తీసుకున్నారు. ఈ ముఠాలో మ...