భారతదేశం, ఏప్రిల్ 3 -- Endowment Lands: హిందూ ధర్మ పరిరక్షణ, అధ్యాత్మిక కార్యక్రమాలు, ఆలయాల్లో ధూపదీప నైవేధ్యాల కోసం దాన పత్రాలతో దానం చేసిన భూములు పరాధీనమవుతున్నాయి. విజయవాడ నగరంలో కోట్లాది రుపాయల ఖరీదు చేసే దేవాదాయ శాఖ భూములు అన్యాక్రాంతమైన వైనం ఒక్కొక్కటిగా వెలుగు చూస్తోంది. దేవుడికి చెందాల్సిన ఆదాయాన్ని అడ్డగోలుగా దోచుకుంటున్న వారిని ఊపేక్షిస్తున్న వ్యవహారాలు బయటపడు తున్నాయి. నోరు లేని దేవుడి సొమ్మును కాజేయడంలో ఆరితేరిన వారికి అడ్డుకట్ట వేయడంలో ప్రభుత్వ యంత్రాంగం విఫలమవుతోంది.

విజయవాడ నగరంలో దేవాదాయ శాఖ ద్వారా దేవుళ్లకు చెందాల్సిన ఆదాయాన్ని దర్జాగా దోచుకుంటున్న వైనాలు ఒక్కొక్కటిగా వెలుగు చూస్తున్నాయి. హిందూ ధర్మ పరిరక్షణ,ఆలయాల దూప దీప నైవేధ్యాల కోసం రాసిచ్చిన భూముల్ని, వాటిపై వచ్చే ఆదాయాన్ని భూములిచ్చిన దాతల వారసులే దోచుకుంటున్నారనే ...