భారతదేశం, ఏప్రిల్ 2 -- Endowment Lands: విజయవాడలో దేవాదాయ శాఖ భూములతో బ్యాంకులకు కుచ్చుటోపీ పెట్టిన ఘటన వెలుగు చూసింది. నగరం నడిబొడ్డున ఉన్న దాదాపు ఆరెకరాల భూమి అన్యాక్రాంతమైనా. దేవాదాయ శాఖ అధికారులు చూసిచూడనట్టు వ్యవహరిస్తున్నారు. ఇవే భూములకు నకిలీ పత్రాలను సృష్టించి వందల కోట్లకు బ్యాంకుల్ని మోసం చేశారు. దేవాదాయ శాఖకు దానపత్రం రాసిన భూములు అన్యాక్రాంతం అవుతున్నా వాటిని రక్షించేందుకు చర్యలు చేపట్టకపోవడం వెనుక దేవాదాయ శాఖ బాధ్యతలు చూసిన మాజీ మంత్రి హస్తం ఉందనే ఆరోపణలు ఉన్నాయి.

విజయవాడ పటమటలో ఉన్న గోవిందరాజులు ధర్మ ఈనాం ట్రస్ట్ భూములు ఉన్నాయి. భూముల్ని దానం ఇచ్చిన దాతల కుటుంబానికి చెందిన మూడో తరం వారసులు భూముల విలువ పెరగడంతో అవి కుటుంబ ఆస్తులంటూ కోర్టుల్లో పిటిషన్లు వేశారు. ఆ భూముల్ని అమ్ముకోడానికి అనుమతివ్వాలని న్యాయస్థానాలను ఆశ్రయించారు....