భారతదేశం, ఏప్రిల్ 12 -- వాయు కాలుష్యాన్ని తగ్గించే విధంగా సరికొత్త ఈవీ పాలసీ 2.0ని రూపొందిస్తోంది దిల్లీ ప్రభుత్వం. రోడ్ల మీద ఎలక్ట్రిక్​ వాహనాల సంఖ్యను పెంచే విధంగా ఈ పాలసీలో అనేక రూల్స్​ ఉంటాయని తెలుస్తోంది. అంతేకాదు, ఈవీ కొనే మహిళలకు దిల్లీ ప్రభుత్వం బంపర్​ ఆఫర్​ని కూడా ఇస్తుందని సమాచారం. ఎలక్ట్రిక్​ ద్విచక్ర వాహనం కొనే దిల్లీ మహిళలకు షరతులతో కూడిన రూ. 30వేల సబ్సిడీని ఇచ్చే యోచనలో ప్రభుత్వం ఉందని తెలుస్తోంది. ఈ ప్రతిపాదన ఈవీ పాలసీ 2.0 ముసాయిదా కాపీని హిందుస్థాన్​ టైమ్స్​ సేకరించింది. ఇందులో అనేక వివరాలు బయటకు వచ్చాయి.

దిల్లీ ఈవీ పాలసీ 2020.. ఆగస్టు 2023 లో ముగియాల్సి ఉంది. అప్పటి నుంచి దీన్ని పొడిగిస్తూ వస్తోంది ప్రభుత్వం. 2025 ఏప్రిల్ మధ్య నాటికి కొత్త విధానం ప్రవేశపెట్టే అవకాశం ఉంది. ముసాయిదా ఇప్పటికే రెడీ అయ్యింది. దీనికి దిల్లీ కే...