భారతదేశం, ఏప్రిల్ 15 -- EC CEO on Attack Issue: ముఖ్యమంత్రి జగన్మోహన్‌ రెడ్డిపై Ys Jagan దాడి Attack వ్యవహారంలో దర్యాప్తను వేగవంతం చేయాలని ఈసీ సీఈఓ మీనా ఆదేశించారు. విజయవాడ నగర పోలీస్ కమిషనర్‌ CP కాంతి రాణాను, ఐ.జి. రవిప్రకాష్‌ల నుంచి సచివాలయంలో దర్యాప్తు వివరాలు తెలుసుకున్న సీఈఓ మీనా, దర్యాప్తు వేగవంతం చేయాలని వారిని ఆదేశించారు.

ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర ముఖ్యమంత్రి వై.ఎస్.జగన్మోహన్ రెడ్డిపై ఎన్టీఆర్ జిల్లా విజయవాడ అజిత్ సింగ్ నగర్ డాబా కొట్ల సెంటర్ సమీపంలో శనివారం రాయితో దాడి చేసిన ఘనకు సంబందించిన కేసు దర్యాప్తును మరింత వేగవంతం చేయాలని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి EC CEO ముఖేష్ కుమార్ మీనా విజయవాడ నగర సి.పి. కాంతి రాణా టాటాను, ఐ.జి. రవిప్రకాష్ ను ఆదేశించారు.

సోమవారం రాష్ట్ర సచివాలయంలోని పోలీస్ అధికారులతో సమావేశమైన సీఈఓ. సిఎంపై దాడి ఘటనక...