భారతదేశం, మార్చి 16 -- East Godavari News : జాతీయ లోక్ అదాలత్(National Lok adalat) లో యార్లగడ్డ బృందదేవి అనే మహిళ రూ.1.12 కోట్ల పరిహారం అందుకుంది. శనివారము తూర్పుగోదావరి జిల్లా(East Godavari) వ్యాప్తంగా జాతీయ లోక్ అదాలత్ నిర్వహించారు. తూర్పు గోదావరి జిల్లా ప్రధాన న్యాయస్థానానికి సంబంధించిన ఒక రోడ్డు ప్రమాదం కేసులో బాధితురాలు యార్లగడ్డ బృందదేవి రూ.కోటి పన్నెండు లక్షల పరిహారం పొందారు.

రోడ్డు ప్రమాదంలో(Road Accident case) తన భర్త మరణిచడంతో... తూర్పు గోదావరి జిల్లా ప్రధాన న్యాయస్థానం, మోటారు వాహన ప్రమాదాల దావా న్యాయస్థానంలో భార్య యార్లగడ్డ బృందదేవి, ఆమె కుమార్తెలు, ఆమె అత్త 2021లో కేసు వేశారు. తమ కేసుని రాజీమార్గంలో పరిష్కరించుకునేందుకు జాతీయ లోక్ అదాలత్(National Lok Adalat) ద్వారా అవకాశం దొరికిందన్నారు. జిల్లా ప్రధాన న్యాయమూర్తి గంధం సునీత ...