భారతదేశం, మార్చి 28 -- మార్చి 28 మయన్మార్, థాయ్ లాండ్ లలో మరో సాధారణ రోజు మాత్రమే. జనజీవనంతో కిటకిటలాడే వీధులు, దుకాణదారులతో కిటకిటలాడే మార్కెట్లు, యధావిధిగా వ్యాపారాలు నడుస్తున్నాయి. కానీ ఒక్క క్షణంలోనే 7.7 తీవ్రతతో భూకంపం సంభవించి, ఆ తర్వాత 6.4 తీవ్రతతో మరో భారీ భూకంపం సంభవించి జీవితాల్ని తలక్రిందులు చేశాయి. మయన్మార్, థాయ్ లాండ్ లతో పాటు, భారత్, వియత్నాం, బంగ్లాదేశ్ లలో ప్రకంపనలు సంభవించాయి.

భూకంపం తీవ్రతకు చాలా నిర్మాణాలు నేలమట్టం అయ్యాయి. డజన్ల కొద్దీ ప్రజలు శిథిలాల కింద చిక్కుకుపోయారు. మయన్మార్ లో 144 మంది మరణించారు. పలువురికి తీవ్ర గాయాలయ్యాయి. శిధిలాల కింద ఇంకా ఎంతమంది ఉన్నారో తెలియని పరిస్థితి నెలకొన్నది. దాంతో, మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉంది. మయన్మార్ లో భారీ ప్రాణనష్టం సంభవిస్తుండటంతో సాయం కావాలని జుంటా చీఫ్ ప్రపంచ దేశాలు...