భారతదేశం, ఏప్రిల్ 9 -- Dy Cm Pawan: గ్రామ పంచాయతీల సమస్యలు వినేందుకు, పరిష్కరించేందుకు కూటమి ప్రభుత్వం సిద్ధంగా ఉందని డిప్యూటీ సీఎం, పంచాయతీరాజ్ మరియు గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి పవన్ కళ్యాణ్ స్పష్టం చేశారు. పంచాయతీల సమస్యలపై మంత్రివర్గంలో చర్చించి పరిష్కారానికి అవకాశం ఉన్న అన్ని సమస్యలను పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు.

గిరిజన ప్రాంతాల్లో గ్రామ పంచాయతీల అభివృద్ధిపై ప్రత్యేకంగా దృష్టి సారిస్తామని పవన్ కళ్యాణ్‌ తెలిపారు. మంగళవారం అరకులో ఆంధ్రప్రదేశ్ సర్పంచుల సంక్షేమ సంఘం నాయకులు, అల్లూరి సీతారామరాజు జిల్లాకు చెందిన గిరిజన గ్రామాల సర్పంచులు పవన్ కళ్యాణ్‌ను ని కలిశారు. గ్రామ పంచాయతీలు ఎదుర్కొంటున్న సమస్యలను వివరించారు. విద్యుత్ బిల్లులపై వడ్డీలు వేసి మరీ పంపుతుండడంతో పంచాయతీలు ఇబ్బందులు పడుతున్నాయని, మైనర్ పంచాయతీలకు ఉచిత విద్యుత్ అందించే కార్...