భారతదేశం, మార్చి 25 -- Durga Temple Lands: అమ్మలగన్నయమ్మ.. ముగ్గురమ్మల మూలపుటమ్మ.. బెజవాడ దుర్గమ్మకే శఠగోపం పెట్టేందుకు కొందరు సిద్ధం అయ్యారు. విజయవాడ నగరం నడిబొడ్డున ఉన్న దాదాపు ఆరు ఎకరాల భూమి లీజును యాభై ఏళ్లకు పొడిగించేందుకు పావులు కదుపుతున్నారు.

నగరం మధ్యలో వందల కోట్ల ఖరీదు భూముల్లో నలభై ఏళ్ల క్రితం విద్యా సంస్థల్ని ఏర్పాటు చేశారు. ఈ భూముల లీజు గడువు ముగియడంతో వాటిని పొడిగించాలనే ప్రతిపాదనలు దేవాదాయశాఖకు చేరాయి. లీజు పొడిగింపుతో పాటు నామమాత్రపు రుసుము చెల్లించాలనే ప్రతిపాదనపై దేవాదాయశాఖ ఎస్టేట్స్‌ విభాగం అభ్యంతరం తెలిపింది.

విజయవాడ దుర్గా మల్లేశ్వర స్వామి దేవస్థానం భూముల్లో ఉన్న లీజుల్ని పొడిగించాలని ప్రభుత్వ స్థాయిలో ఉన్నతాధికారుల నుంచి మౌఖిక ఆదేశాలు అందడంతో దేవాదాయ శాఖ అందుకు ప్రతిపాదనలు సిద్ధం చేసింది. ఏడాదికి రూ.10లక్షల రుపాయల ల...