భారతదేశం, మార్చి 31 -- Durga Temple: విజయవాడ వన్‌టౌన్‌ పోలీస్‌ స్టేషన్‌ ప్రాంగణాన్ని ఇంద్రకీలాద్రిపై కొలువైన కనక దుర్గమ్మ పుట్టినిల్లుగా కొన్నేళ్లుగా విజయవాడ పోలీసులు ప్రచారం చేస్తున్నారు. దీనికి చారిత్రకంగా ఎలాంటి ఆధారాలు లేకపోయినా ఉత్సవాల నిర్వహణతో పాటు ఆలయంపై పట్టు సాధించేందుకు ఈ తరహా ప్రచారాలు చేస్తున్నారనే విమర్శలు ఉన్నాయి.

బెజవాడ ఇంద్రకీలాద్రిపై ఏటా దసరా శరన్నవరాత్రి ఉత్సవాలు అంగరంగా వైభవంగా జరుగుతాయి. విజయవాడ పట్టణంగా ఉన్నప్పటి నుంచి దసరా పండుగను వైభవంగా నిర్వహించడం ఆనవాయితీగా వస్తోంది. దసరా సమయంలో 9రోజుల పాటు దశావతారాల్లో భక్తులకు దర్శనమిచ్చే కనక దుర్గ అమ్మవారు చివరి రోజు కృష్ణా నదిలో హంస వాహనంలో విహరిస్తారు. నదీ విహారం తర్వాత అమ్మవారి ఉత్సవ విగ్రహాన్ని వన్‌టౌన్‌ పోలీస్‌ స్టేషన్‌కు చెందిన సిబ్బంది ఊరేగింపుగా మెట్ల మార్గం వద్దకు చ...