భారతదేశం, ఏప్రిల్ 17 -- మంగళవారం కురిసిన భారీ వర్షానికి ఎడారి నగరమైన దుబాయ్ స్తంభించిపోయి ప్రధాన రహదారులు, అంతర్జాతీయ విమానాశ్రయం జలమయమయ్యాయి. దుబాయ్ విమానాశ్రయంలో 25 నిమిషాల పాటు కార్యకలాపాలను నిలిపివేశారు. దుబాయ్ అంతర్జాతీయ విమానాశ్రయం నీటితో మునిగి ఉన్న దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.

దుబాయ్ అంతర్జాతీయ విమానాశ్రయంలో సేకరించిన వాతావరణ డేటా ప్రకారం.. ఏడాదిన్నర కాలంలో కురిసేంత వర్షపాతం దుబాయ్ నగరంలో 24 గంటల్లోనే నమోదైందని తేలింది. సోమవారం రాత్రి ఈ వర్షం ప్రారంభమైంది. ఆ రోజు అర్థరాత్రి వరకు 20 మిల్లీమీటర్ల (0.79 అంగుళాలు) వర్షపాతం నమోదైంది. దాంతో, దుబాయిలోని రహదారులు జలమయమయ్యాయి. మంగళవారం ఉదయానికి ఇది మరింత తీవ్రమైంది. ఆ రోజు చివరి నాటికి, మొత్తంగా 142 మిల్లీమీటర్ల (5.59 అంగుళాలు) కంటే ఎక్కువ వర్షపాతం నమోదై రికార్డు సృష్టించింది. ద...