భారతదేశం, అక్టోబర్ 6 -- Dongalunnaru Jagratha OTT Release Date: సంగీత ద‌ర్శ‌కుడు కీర‌వాణి త‌న‌యుడు శ్రీసింహ‌ హీరోగా న‌టించిన దొంగ‌లున్నారు జాగ్ర‌త్త సినిమా ప‌దిహేను రోజుల్లోనే ఓటీటీలో రిలీజ్ కానుంది. స‌ర్వైవ‌ల్ థ్రిల్ల‌ర్ కాన్సెప్ట్‌తో రూపొందిన ఈ సినిమా సెప్టెంబ‌ర్ 23న ప్రేక్ష‌కుల ముందుకొచ్చింది.

పార్క్ చేసి ఉన్న కారులోని ఖ‌రీదైన వ‌స్తువుల్నిదొంగ‌త‌నం చేయాల‌ని ప్లాన్ చేసిన ఓ దొంగ క‌థ‌తో ఈ సినిమా రూపొందింది . అనుకోని ప‌రిస్థితుల్లో ఆ కారులోనే దొంగ చిక్కుకుపోతాడు. ఈ క్ర‌మంలో అత‌డికి ఎదురైన ప‌రిణామాల‌తో ద‌ర్శ‌కుడు స‌తీష్ త్రిపుర....దొంగ‌లున్నారు జాగ్ర‌త్త‌ సినిమాను తెర‌కెక్కించాడు.

ప్ర‌యోగాత్మ‌కంగా రూపొందిన ఈ సినిమాను సురేష్ ప్రొడ‌క్ష‌న్స్‌, గురు ఫిల్మ్స్ సంస్థ‌లు నిర్మించాయి. థియేట‌ర్ల‌లో విడుద‌లైన రెండు వారాల్లోనే ఈ సినిమా ఓటీటీలోకి రాబో...