భారతదేశం, మార్చి 27 -- Doctor Suicide: బట్టతల కారణంగా వివాహం కావడం లేదనే బాధితుడు ఎంబీబీఎస్‌ వైద్యుడు రైలు కింద పడి ఆత్మహత్య చేసుకున్న ఘటన హైదరాబాద్‌లో వెలుగు చూసింది. అల్వాల్ బస్తీ ఆస్పత్రిలో డాక్టర్‌‌గా పనిచేస్తున్న పురోహిత్ కిషోర్‌ రైలు కింద పడి ఆత్మహత్య చేసుకున్నాడు.

ఆల్వాల్‌ బస్తీ దవాఖానాలో వైద్యుడిగా పనిచేస్తున్న పురోహిత్ కిషోర్(34) ఆత్మహత్యకు పాల్పడ్డారు. సికింద్రాబాద్ రైల్వే పోలీస్‌ ఏస్సై రమేష్ కథనం ప్రకారం గుజరాత్‌కు చెందిన ప్రకాష్‌ కుటుంబం కాప్రాలో స్థిరపడింది. ఆయనకు ఇద్దరు కుమారులు ఉన్నారు. చిన్న కుమారుడు కిషోర్ ఎంబీబీఎస్ పూర్తి చేసి అల్వాల్ బస్తీలో వైద్యుడిగా పనిచేస్తున్నారు.

డాక్టర్‌ కిషోర్‌కు కొన్ని రోజుల కిందట నిశ్చితార్థం జరిగింది. బట్టతల ఉండడంతో పాటు ఇతర కారణాల వల్ల అతనితో పెళ్లిని యువతి కుటుంబం రద్దు చేసుకున్నారు. పెళ్...