భారతదేశం, ఏప్రిల్ 2 -- DIET Recruitment: ఏపీలోని జిల్లా విద్యా శిక్షణ సంస్థల (DIET కాలేజీలు)ల్లో అధ్యాపక పోస్టులు భర్తీకి నోటిఫికేషన్‌ విడుదలైంది. ఆన్లైన్‌‌లో దరఖాస్తు చేయడానికి ఏప్రిల్ 10వ తేదీ వరకు అవకాశం ఉంటుంది. ఏప్రిల్ 16,17 తేదీల్లో రాతపరీక్ష నిర్వహిస్తారు. ఈ మేరకు డైట్‌ రిక్రూట్‌మెంట్‌ నోటిఫికేషన్ జారీ చేశారు.

రాష్ట్రంలోని 13 జిల్లా విద్యా శిక్షణ సంస్థల (DIETలు)ను బలోపేతం చేయడానికి డిప్యూటేషన్ పద్ధతిలో అధ్యాపకుల భర్తీ చేపడుతున్నఏపీ పాఠశాల విద్యాశాఖ డైరెక్టర్‌ విజయ్ రామరాజు.వి నోటిఫికేషన్ జారీ చేసినట్టు తెలిపారు.

2025-26 సంవత్సరానికి అర్హులైన స్కూల్‌ అసిస్టెంట్స్‌, ప్రధానోపాధ్యాయులు, మండల విద్యాశాఖాధికారుల నుండి దరఖాస్తులు స్వీకరిస్తున్నట్లు తెలిపారు.

అర్హతగల విద్యార్థులు సంబంధిత సబ్జెక్టులలో 55 శాతం మార్కులు, ఎంఈడిలో 55 శాతం మార...