Hyderabad, మార్చి 24 -- ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ యుగం వచ్చేసింది. జీవితంలోని ఎన్నో అంశాలను ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మెరుగుపరుస్తోంది. ఇప్పుడు రూర్కెలాలోని నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ పరిశోధకులు డయాబెటిస్ రోగుల కోసం ఒక కొత్త పరిశోధన చేశారు. వారికి ఏఐ సహాయంతో రక్తంలో చక్కెర స్థాయిలను కనిపెట్టే యాప్‌ను తయారు చేశారు. ఈ యాప్ విజయవంతంగా పనిచేస్తోంది. త్వరలో మీకు అందుబాటులోకి వచ్చేస్తుంది.haritha

డయాబెటిస్ ఒక్కసారి వచ్చిందంటే జీవితాంతం వెంటాడే నీడ లాంటిది. ఇది మందుల ద్వారా, జీవనశైలి ద్వారా అదుపులో ఉంచుకోవాలి తప్ప పూర్తిగా నయం చేయడం కుదరదు. జీవనశైలిని ఆహారపు అలవాట్లను మార్పులు చేసుకోవడం ద్వారా డయాబెటిస్ నియంత్రణలో ఉంచుకొని ఆరోగ్యంగా జీవించవచ్చు. ఎప్పటికప్పుడు రక్తంలో చక్కెర స్థాయిలు ఎలా ఉన్నాయో డయాబెటిస్ రోగులు తెలుసుకోవాల్సిన అవసరం ఉంద...