భారతదేశం, నవంబర్ 28 -- Husband chopped into pieces : శ్రద్ధ హత్య కేసు సృష్టించిన అలజడుల నుంచి బయటపడక ముందే.. ఢిల్లీలో మరో దారుణం వెలుగులోకి వచ్చింది. ఓ మహిళ.. తన భర్తను హత్య చేసి, శరీరాన్ని 22 ముక్కలుగా నరికేసింది. కుమారుడు సాయంతో.. వాటిని వివిధ ప్రాంతాల్లో పడేసింది. జూన్​లో జరిగిన ఈ ఘటనను పోలీసులు తాజాగా పరిష్కరించారు.

అంజన్​ దాస్​ అనే వ్యక్తి.. భార్య పూనమ్​, కుమారుడు దీపక్​తో కలిసి తూర్పు ఢిల్లీలోని పాండవ్​ నగర్​లో నివాసముండేవాడు. అంజన్​ దాస్​పై భార్యకు ఎప్పటి నుంచో అనుమానాలు ఉండేవి. అతనికి వివాహేతర సంబంధం ఉందని భావించేది.

Wife kills husband : ఈ క్రమంలోనే.. ఈ ఏడాది జూన్​లో.. కుమారుడు దీపక్​తో కలిసి అంజన్​ దాస్​ను చంపేసింది అతని భార్య. అతనికి నిద్ర మాత్రలు ఇచ్చింది. అంజన్​ దాస్​ నిద్రలోకి జారుకున్న వెంటనే.. హత్య చేసింది. ఇందుకు కుమారుడ...