భారతదేశం, ఏప్రిల్ 28 -- DeAr Movie OTT: జీవీ ప్రకాశ్ కుమార్, ఐశ్వర్య రాజేశ్ ప్రధాన పాత్రలు పోషించిన తమిళ మూవీ 'డియర్' మంచి అంచనాలతో థియేటర్లలోకి వచ్చింది. ఏప్రిల్ 11వ తేదీన తమిళంలో రిలీజైన ఈ చిత్రం.. ఒక్క రోజు తర్వాత ఏప్రిల్ 12న తెలుగులోనూ విడుదలైంది. ఈ సినిమా తెలుగు వెర్షన్ కోసం కూడా మూవీ టీమ్ బాగానే ప్రమోషన్లను చేసింది. అయితే, అనుకున్న స్థాయిలో డియర్ మూవీ కలెక్షన్లను రాబట్టలేకపోయింది. ఈ తరుణంలో 20 రోజులోపే ఈ చిత్రం ఓటీటీలో స్ట్రీమింగ్‍కు వచ్చేసింది.

డియర్ సినిమా నేడు (ఏప్రిల్ 28) నెట్‍ఫ్లిక్స్ ఓటీటీ ప్లాట్‍ఫామ్‍లో స్ట్రీమింగ్‍కు అందుబాటులోకి వచ్చింది. థియేటర్లలో రిలీజ్ అయిన 17 రోజుల్లోనే ఈ కామెడీ ఫ్యామిలీ డ్రామా మూవీ ఓటీటీలో అడుగుపెట్టింది. అనుకున్నస్థాయిలో థియేట్రికల్ రన్ లేకపోవటంతో అంచనాల కంటే ముందే ఈ మూవీ స్ట్రీమింగ్‍కు అడుగుపెట్టిం...