భారతదేశం, ఫిబ్రవరి 15 -- దేశవ్యాప్తంగా ఉన్న ప్రముఖ కేంద్రీయ, రాష్ట్ర స్థాయి విశ్వవిద్యాలయాల్లో పీజీ కోర్సుల్లో ప్రవేశాల కోసం నిర్వహించే సీయూఈటీ పీజీ 2026 పరీక్షల షెడ్యూల్‌ను నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (ఎన్టీఏ) అధికారికంగా విడుదల చేసింది. మొత్తం 4.11 లక్షల మందికి పైగా విద్యార్థులు ఈసారి అప్లై చేసుకోగా, వారందరికీ సబ్జెక్టుల వారీగా పరీక్ష తేదీలను ఖరారు చేస్తూ ఎన్టీఏ నిర్ణయం తీసుకుంది.

మొత్తం 4,11,366 మంది అభ్యర్థుల కోసం మార్చి 6 నుంచి మార్చి 27 మధ్య ఈ సీయూఈటీ పీజీ 2026 పరీక్షలు నిర్వహించనున్నారు. కంప్యూటర్ ఆధారిత విధానంలో (సీబీటీ) జరిగే ఈ పరీక్షలు రోజుకు రెండు లేదా మూడు షిఫ్టుల్లో జరుగుతాయి.

పరీక్ష ప్రారంభం: మార్చి 6, 2026

పరీక్ష ముగింపు: మార్చి 27, 2026

మొత్తం షిఫ్టులు: 44 షిఫ్టులు

పరీక్ష సమయం: ప్రతి పేపర్‌కు 90 నిమిషాల సమయం కేటాయించారు....