భారతదేశం, మార్చి 18 -- Csk Cricketer: ఈ సారి ఐపీఎల్‌లో టైటిల్ ఫేవ‌రేట్ల‌లో ఒక‌టిగా చెన్నై సూప‌ర్ కింగ్స్ బ‌రిలోకి దిగుతోంది. మార్చి 23న ముంబై ఇండియ‌న్స్‌తో జ‌రుగ‌నున్న మ్యాచ్‌తో ఐపీఎల్ 2025ని మొద‌లుపెట్ట‌బోతున్న‌ది చెన్నై సూప‌ర్ కింగ్స్‌. ఐపీఎల్ ముంగిట సీఎస్‌కే స్టార్ బౌల‌ర్ డేటింగ్ వ‌ర్గాలు కోలీవుడ్‌లో హాట్ టాపిక్‌గా మారాయి. సీఎస్‌కే బౌల‌ర్ మ‌తీషా ప‌తిర‌నా త‌మిళ సీరియ‌ల్ హీరోయిన్ నేహా మీన‌న్‌తో ప్రేమ‌లో ప‌డ్డ‌ట్లు ప్ర‌చారం జ‌రుగుతోంది.

నేహా మీన‌న్‌తో చాలా కాలంగా మ‌తీషా ప‌తిర‌నాకు ప‌రిచ‌యం ఉంద‌ని, ఇద్ద‌రు ప్రేమ‌లో ఉన్న‌ట్లు పుకార్లు షికారు చేస్తోన్నాయి. నేహామీన‌న్‌ను క‌ల‌వ‌డానికి ఐపీఎల్ లేని టైమ్‌లో కూడా మ‌తీషా ప‌తిర‌నా చెన్నై వ‌చ్చిన‌ట్లు చెబుతోన్నారు. అంతే కాకుండా ప‌తిర‌న‌ ఆడిన ఐపీఎల్ మ్యాచ్‌ల‌కు నేహా మీన‌న్ కూడాగ‌తంలో అటెండ్ అయిన‌ట్లు...