భారతదేశం, జనవరి 31 -- Crime news: తన పర్యవేక్షణలో క్రికెట్ క్రీడను నేర్చుకుంటున్న 12 ఏళ్ల బాలికకు ఒక క్రికెట్ కోచ్ మత్తుమందు ఇచ్చి లైంగిక దాడికి పాల్పడ్డారు. ఈ దారుణ ఘటన ఉత్తర ప్రదేశ్ లోని కాన్పూర్ లో ఉన్న పంకి ప్రాంతంలో చోటుచేసుకుంది. ప్రస్తుతం క్రికెట్ అకాడమీలో పనిచేసిన ఆ కీచక కోచ్ పరారీలో ఉన్నాడు.

గంగాగంజ్ కు చెందిన నిందితుడైన క్రికెట్ కోచ్ కోచింగ్ క్లాసుల అనంతరం ఆ మైనర్ బాలికను తన కాలనీకి తీసుకువచ్చి, ఆమెకు మత్తుమందు ఇచ్చి లైంగిక దాడికి పాల్పడేవాడు. రెండు నెలల పాటు ఆ బాలికపై ఈ అఘాయిత్యాన్ని కొనసాగించాడు. ఆ బాలిక తన తల్లికి ఈ విషయం చెప్పడంతో ఆ కోచ్ పై ఆమె పంకీ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసింది. నిందితుడు ఆ బాలికను బ్లాక్ మెయిల్ చేశాడని, ఆమెను బెదిరించడానికి కులపరమైన దూషణలకు పాల్పడ్డాడని వారు పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొన్నారు....