భారతదేశం, ఏప్రిల్ 28 -- Cricket Betting : సులభంగా డబ్బు సంపాదించాలనే ఆశతో ఆన్లైన్ బెట్టింగ్(Online Betting) లకు అలవాటు పడి యువత ప్రాణాలు పోగొట్టుకుంటున్నారు. వీటిపై పోలీసులు ఎంత అవగాహనా కల్పిస్తున్నా ప్రతిరోజు ఎక్కడో ఒకచోట ఇలాంటి ఘటనలు చోటుచేసుకుంటూనే ఉన్నాయి. తాజాగా ఇలాంటి సంఘటనే సంగారెడ్డి(Sangareddy) జిల్లాలో చోటుచేసుకుంది. ప్రస్తుతం ఐపీఎల్(IPL) సీజన్ నడుస్తుతుండడంతో క్రికెట్ బెట్టింగ్ మాయలో పడి ఆన్లైన్ యాప్స్ లో, స్నేహితుల దగ్గర అప్పులు చేసి బెట్టింగ్ లో పెట్టి తీవ్రంగా నష్టపోయాడు ఓ యువకుడు. తల్లిదండ్రులకు చెప్పలేక, అప్పులు తీర్చే మార్గం కనపడక మనోవేదనకు గురైన బీటెక్ విద్యార్థి ఫ్యాన్ కు ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ సంఘటన సంగారెడ్డి జిల్లా సదాశివపేట పట్టణంలో చోటుచేసుకుంది.

సంగారెడ్డి (Sangareddy)జిల్లా సదాశివపేట పట్టణం గొల్లక...