భారతదేశం, మార్చి 24 -- CPM On TDP: పార్లమెంటు నియోజకవర్గాల పునర్విభజన విషయంలో కూటమి పార్టీలు అనుసరిస్తున్న వైఖరి రాష్ట్రానికి హానికరమని, దీనిపై టీడీపీ మౌనం రాష్ట్రానికి హానికరమని సీపీఎం ఆరోపించింది. టీడీపీ, జనసేన పార్టీల వైఖరి ఏమిటో చెప్పాలని సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వి.శ్రీనివాసరావు కోరారు.

పార్లమెంటు నియోజక వర్గాల డీలిమిటేషన్‌పై డిఎంకె ఏర్పాటు చేసిన సమావేశానికి ఆంధ్రప్రదేశ్‌ నుంచి తప్ప దక్షిణ భారతదేశంలోని అన్ని రాష్ట్రాల నుండి అన్ని పార్టీలూ ఒక తాటిమీదకు వచ్చి హాజరయ్యాయని, ఇది రాష్ట్ర ప్రయోజనాలకు నష్టమని, పార్లమెంటులో ప్రాధాన్యత తగ్గేందుకు దారితీస్తుందని తెలిపారు.

మోడీతో దోస్తీ కోసం రాష్ట్ర ప్రయోజనాలను దెబ్బతీస్తున్నారని, మన రాష్ట్రంలో టీడీపీ, జనసేన గోడమీద పల్లివాటంగా డ్యాన్స్‌ చేస్తున్నాయని పేర్కొన్నారు. అదే సమయంలో వైసిపి హాజరుకాకపో...