భారతదేశం, డిసెంబర్ 29 -- చనిపోయిన వ్యక్తి ముక్కు, చెవులు పత్తితో నింపడం మనందరం చూశాం. ఇలా ఎందుకు చేస్తారో ఎప్పుడైనా ఆలోచించారా? దీని వెనక కొన్ని కారణాలు ఉన్నాయి. అవి ఏంటో తెలుసుకుందాం. హిందూ మతంలో మరణించిన వారి కుటుంబ సభ్యులతో దహన సంస్కారాలు నిర్వహిస్తారు. అంత్యక్రియలకు ముందు చేయవలసినవి, చేయకూడనివి కొన్ని ఉంటాయి. అలాగే అంత్యక్రియల తర్వాత పాటించవలసినవి ఫాలో అవ్వాలి.

అదేవిధంగా మృతదేహాన్ని ఇంటికి తీసుకువచ్చేటప్పుడు గుర్తుంచుకోవలసిన విషయాలను కూడా పురాణాలు పేర్కొంటున్నాయి. మృతదేహాన్ని ఇంటికి తీసుకొచ్చిన అనంతరం మృతుడి కుటుంబీకులు కొందరు పూజలు కూడా చేస్తారు. ఇది కొంతమంది ఆచారం. మరో నియమం కూడా ఉంది. చనిపోయిన వ్యక్తి ముక్కు, చెవులలో పత్తిని ఉంచడం. ఇలా చేసేందుకు కొన్ని కారణాలు ఉన్నాయి.

దీని వెనుక శాస్త్రీయ, ఆధ్యాత్మిక కారణాలు ఉన్నాయని మీరు తెలుసు...