భారతదేశం, మార్చి 16 -- Congress Protests : అసెంబ్లీలో స్పీకర్ పట్ల బీఆర్ఎస్ ఎమ్మెల్యే వ్యవహరించిన తీరును నిరసిస్తూ ఉమ్మడి కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా కాంగ్రెస్ నిరసన ఆందోళనకు దిగారు. కేటీఆర్, జగదీశ్వర్ రెడ్డి దిష్టిబొమ్మల దహనం చేశారు. సిరిసిల్లలో కాంగ్రెస్ నిరసన ఆందోళనను బీఆర్ఎస్ శ్రేణులు అడ్డుకునే ప్రయత్నం చేయగా పోలీసులు పలువురి అరెస్టు చేయడంతో స్వల్ప ఉద్రిక్తతకు దారి తీసింది.

అధికార పార్టీ కాంగ్రెస్ రోడ్డెక్కింది. అసెంబ్లీలో బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు వ్యవహరించిన తీరును నిరసిస్తూ ఉమ్మడి కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా నిరసన ఆందోళన దిగి, కేటీఆర్ జగదీశ్వర్ రెడ్డి దిష్టిబొమ్మలు దహనం చేశారు. కరీంనగర్ లో నగర కాంగ్రెస్ ఆధ్వర్యంలో కేటీఆర్, జగదీశ్వర్ రెడ్డి దిష్టిబొమ్మను దగ్ధం చేశారు. బీఆర్ఎస్ నేతల తీరుపై మండిపడ్డారు.

కేసీఆర్ కేటీఆర్ కు వ్యతిరేకంగా నినాద...