భారతదేశం, ఫిబ్రవరి 27 -- ఇటీవల ఏపీ తీరంలో సముద్రం రంగులు మారుస్తోంది. దీన్ని చూసిన ప్రజలు ఆనందం, ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. కొందరు మాత్రం అసలు సముద్రం రంగు ఎందుకు మారుతోందని చర్చించుకుటున్నారు. గతేడాది మధ్యలో.. విశాఖ జిల్లా భీమిలి సమీపంలో సముద్రం ఎరుపు రంగులో కనిపించింది. ఆ తర్వాత ఇటీవల పెదజాలరిపేటలో పసుపు రంగులో కనిపించింది. తాజాగా విశాఖ ఆర్కే బీచ్ సమీపంలో ఆకుపచ్చగా కనిపించింది.

ఇలా తరుచూ సముద్రం రంగులు మార్చడం దేనికి సంకేతం అని ప్రజలు చర్చించుకున్నారు. నీలి రంగులో కనిపించే సముద్రం ఇలా రంగులు మారుతోంది ఎందుకు? సముద్రానికి రంగు మార్చే గుణం ఉందా? అనే ప్రశ్నలు వ్యక్తమవుతున్నాయి. ఇలా సముద్రం రంగులు మారడానికి అనేక కారణాలు ఉన్నాయని సముద్ర శాస్త్రవేత్తలు చెబుతున్నారు. దీనికి సంబంధించిన ముఖ్యమైన 6 అంశాలు ఇలా ఉన్నాయి.

బంగాళాఖాతంలో తరచుగా తు...