భారతదేశం, మార్చి 15 -- CM Chandrababu : పశ్చిమగోదావరి జిల్లా తణుకు పట్టణంలో స్వర్ణాంధ్ర -స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పాల్గొన్నారు. పారిశుద్ధ్య కార్మికులతో కలిసి ఎన్టీఆర్ పార్క్ లో చెత్తను తొలగించారు. వారి సమస్యలు తెలుసుకున్నారు. స్వచ్ఛాంధ్ర మనందరి బాధ్యతని సీఎం పిలుపునిచ్చారు.

అనంతరం ఏర్పాటు చేసిన కార్యక్రమంలో సీఎం చంద్రబాబు మాట్లాడుతూ..."వేస్ట్ టు ఎనర్జీ కింద, కుళ్లిపోయిన కూరగాయల నుంచి సంపదను సృష్టించే ప్రయోగాత్మక ప్రయత్నం తణుకులో చేస్తున్నాం. ఇది సక్సెస్ అయితే, రాష్ట్రమంతటా అమలు చేస్తాం. ప్రతి నెలా 3వ శనివారం స్వచ్ఛాంధ్ర కార్యక్రమం పెట్టాం. రాష్ట్రంలో అందరూ నెలకు ఒక రోజు స్వచ్ఛాంధ్ర కోసం పనిచేయాలి.

అలాగే, మన ఆరోగ్యం కాపాడుతూ, మన కోసం ఎవరూ చేయని పని పారిశుద్ధ్య కార్మికులు చేస్తున్నారు. వారిని మనం సమాజంలో గౌరవి...